ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తుల కోసం నిమిషానికో బస్సు,,,తిరుమల గరుడ సేవ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 28, 2025, 08:45 PM

తిరుమలలో సాధారణ రోజుల్లోనే భక్తుల రద్దీ భారీగా ఉంటుంది. ఇక బ్రహ్మత్సోవాల వేళ ఈ రద్దీ మరింత పెరుగుతుంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు. ఇదిలా ఉంటే తిరుమలలో ప్రతి సంవత్సరం సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన ఆదివారం నాడు మలయప్పస్వామి మోహినీ అలంకారంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. ఆదివారం సాయంత్రం గరుడ సేవ జరుగుతోంది. దీన్ని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈక్రమంలో ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. నిమిషానికో బస్సు నడిచేలా చర్యలు తీసుకుంటుంది. ఆ వివరాలు..


గరుడ సేవ నేపథ్యంలో తిరుపతి-తిరుమల మధ్య 425 బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ముందుకు వచ్చింది. తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల నుంచి వీటిని నడపనున్నారు. భారతీయ విద్యాభవన్, ఎస్‌వీసీఈ కాలేజ్ గ్రౌండ్, మామిడికాయల మార్కెట్, దేవలోక్, చెర్లోపల్లి సమీపంలోని హైవే వంటి ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉంచనున్నారు. భారీగా తరలి వస్తోన్న భక్తులను దృష్టిలో పెట్టుకుని నిమిషానికి ఒక బస్సు లెక్కన రోజుకు 3,125 ట్రిప్పులతో దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


గరుడ సేవ నేపథ్యలో తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తిరుమలకు వెళ్లే భక్తుల కోసం.. తిరుపతిలోని 10 ప్రాంతాల్లో బస్సులు, కార్లు, బైకుల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించారు. అలానే అలిపిరి నుంచి తిరుమలకు సుమారు 4 వేల వాహనాల వరకు ప్రైవేట్ వాహనాలను అనుమతించే అవకాశం ఉంది. అలానే భక్తులకు అత్యవసర వైద్యసేవల అందించేందుకు 2 బ్యాటరీ వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు, మందులు సిద్ధంగా ఉంచారు. వృద్ధుల కోసంప్రత్యేక షెడ్డు వద్ద 12 పడకల ఐసీయూ విభాగం.. 14 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. పలువురు వైద్య సిబ్బంది సేవలు అందిస్తున్నారు.


గరుడోత్సవం నేపథ్యంలో తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతుంది. ఎటు చూసిన శ్రీవారి భక్తులే కనిపిస్తున్నారు. తిరు వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులు సంఖ్య కూడా అధికంగా ఉంది. ఇప్పటికే 2 లక్షల50 వేలకు పైగా భక్తులు తిరుమలలో గరుడోత్సవం దర్శనం కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. రాత్రికి మరో లక్షమంది వచ్చే అవకాశం ఉందంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa