ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హింసా రాజకీయాలకు పాల్పడిన ఏ ఒక్కరిని విడిచిపెట్టేదిలేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 01:42 PM

అధికారమదంతో విర్రవీగుతున్న కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలకు బుద్దిచెప్పేందుకే వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్‌ బుక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని శ్రీ స‌త్య‌సాయి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షురాలు ఉషాశ్రీ చ‌రణ్ అన్నారు. శ‌నివారం గోరంట్ల మండల పరిధిలోని మల్లాపల్లి పంచాయ‌తీ కలిగేరి మ‌జ‌రా గ్రామంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గుడ్ మార్నింగ్ అంటూ ప్రజలతో మమేకమై కాఫీ తాగుతూ ప్రజలందరినీ ఉషాశ్రీచరణ్ పలకరించారు. అనంత‌రం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి డిజిట‌ల్ బుక్‌ను ఆమె ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రెడ్‌బుక్‌ పేరిట కూటమి నేతలు, కొంత మంది పోలీసు అధికారులు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు, సోషియల్‌ మీడియా యాక్టివిస్ట్‌లను వేధిస్తున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే హింసా రాజకీయాలకు పాల్పడిన నేతలతో పాటు అక్రమ కేసులు బనాయించిన అధికారులందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టి, న్యాయపోరాటం సాగిస్తామన్నారు. అన్యాయానికి గురైన పార్టీ కార్యకర్తలకు డిజిటల్‌ బుక్‌ భరోసా లాంటిదన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa