ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో రాజకీయాలకి తెరలేపవద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 04, 2025, 01:43 PM

పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాన్ని రాజకీయాలకు అతీతంగా జరపాల‌ని జెడ్పీ చైర్మ‌న్‌, విజ‌య‌న‌గ‌రం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సంప్రదాయం గా వస్తున్న ఆచారాలను, పెద్దలను గౌరవించే విధానాలను ప్ర‌భుత్వం పాటించాల‌ని సూచించారు. టీడీపీ ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రకటనలు చేసి దురుద్దేశాలను ఆపాదించవద్దు అని ఆయ‌న హిత‌వు ప‌లికారు. శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కోరిన విధంగా ఆయనకు అమ్మ వారి సిరిమాను దర్శనానికి ప్రభుత్వ అధికారులు  ఏర్పాట్లు చేయాల‌ని మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa