అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ముఖ్యంగా బయట జరుగుతున్న ఓ గొడవను ఆపేందుకు వెళ్లిన ఆయన.. మీరిప్పుడు ఎలా ఉన్నారు, ఓకేనా అడి అడిగిన పాపానికే ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రోజు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారత సంతతికి చెందిన 50 ఏళ్ల రాకేశ్.. పిట్స్బర్గ్లోని రాబిన్సన్ టౌన్షిప్వో ఓ మోటెల్ను నిర్వహిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే మోటెల్లో పని చేసుకుంటుండగా.. పార్కింగ్ వద్ద గొడవ జరిగింది. దీంతో రాకేష్ వెంటనే అక్కడకు వెళ్లారు. ఏమైంది, ఎందుకు గొడవ పడుతున్నారు, మీరిప్పుడు బాగానే ఉన్నారా అంటూ గన్మెన్ను అడిగారు. దీంతో వెంటనే ఆ వ్యక్తి రాకేశ్పై కాల్పులకు పాల్పడ్డాడు. నేరుగా అతడి తలలో కాల్చగా.. రాకేష్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పగా.. హుటాహుటిన రంగంలోకి దిగారు.
రాకేశ్ను కాల్చి చంపిన నిందితుడిని 37 ఏళ్ల స్టాన్లీ యూజీన్ వెస్ట్గా గుర్తించారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాకేష్ ఎహాగాబన్ గన్మెన్ను మీరు బాగానే ఉన్నారా మిత్రమా? అని అడిగినప్పుడు వెస్ట్ అతనిపై కాల్పులు జరిపాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. వెస్ట్ రాకేష్ వైపు నడుచుకుంటూ వచ్చి ఆయనకు ఒక అడుగు దూరంలో ఉండగా తుపాకీ ఎత్తి తలపై కాల్చాడని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు కొన్ని నిమిషాల ముందు నిందితుడు వెస్ట్ ఒక మహిళపై కాల్పులు జరిపాడు. ఈక్రమంలోనే విషయం తెలుసుకోవడానికి రాకేశ్ బయటకు వచ్చారు. యజమాని అక్కడికి చేరుకోగానే.. నిందితుడు వెస్ట్ అతనిని తలపై కాల్చి చంపాడని అలఘేని కౌంటీ సూపరింటెండెంట్ క్రిస్టోఫర్ కియర్న్స్ వెల్లడించారు. ఆపై అక్కడి నుంచి పారిపోయాడని కూడా చెప్పారు. అయితే కాల్పుల్లో గాయపడిన ఆ మహిళను హుటాహుటిన ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు.
అయితే గాయపడిన మహిళ, ఓ చిన్నారితో పాటే నిందితుడు వెస్ట్ గత రెండు వారాలుగా మోటెల్లో అద్దెకు దిగాడని పోలీసులు వెల్లడించారు. అయితే సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు కొద్ది గంటల్లోనే అతడిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఎన్కౌంటర్ జరిపారు. ఈక్రమంలోనే నిందితుడికి గాయాలు కాగా.. ప్రస్తుతం అతడిని ఆస్పత్రిలో చేర్చారు.
ఇటీవల ఓ భారత సంతతికి చెందిన ఓ మోటెల్ మేనేజర్ను తల నరికి హత్య చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాషింగ్ మిషన్ వాడుకోవడం వద్దు అన్నందుకే మోటెల్లో పని చేసే వ్యక్తి.. మేనేజర్ చంద్రమౌళి నాగమల్లయ్యను ఆయన భార్య, కుమారుడి కళ్లెదుటే అత్యంత దారుణంగా నరికి చంపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa