ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పశ్చిమ బెంగాల్‌లో సామూహిక అత్యాచారానికి గురైన ఒడిశాకు చెందిన విద్యార్థిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 12, 2025, 04:49 PM

పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒడిశాకు చెందిన విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన బాధితురాలు శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో తన క్లాస్‌మేట్‌తో కలిసి భోజనం కోసం కాలేజీ ప్రాంగణం నుంచి బయటకు వచ్చింది. ఆ సమయంలో కొందరు దుండగులు వారిని అడ్డగించి వేధించడం మొదలుపెట్టారు. భయంతో ఆమె స్నేహితుడు అక్కడి నుంచి పారిపోగా, ఒంటరిగా చిక్కిన యువతిని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారని అసన్సోల్-దుర్గాపూర్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. అనంతరం నిందితులు ఆమె ఫోన్‌ను కూడా లాక్కుని పరారయ్యారు.ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. “ఇక్కడ మా కుమార్తె చదువును కొనసాగించబోము. తనని ఇంటికి తీసుకెళ్లిపోతాం” అని ఆమె తల్లిదండ్రులు మీడియాతో అన్నారు.ఈ ఘటనపై స్థానిక బీజేపీ నాయకత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గతంలో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు తరహాలోనే ఈ కేసు వివరాలను కూడా కప్పిపుచ్చే ప్రయత్నం జరగకూడదని వారు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa