ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాతికేళ్ల అమెరికా లైఫ్‌కి గుడ్‌బై? భారత్‌కు ఎన్ఆర్ఐ ఫ్యామిలీ

national |  Suryaa Desk  | Published : Tue, Oct 14, 2025, 09:59 PM

అమెరికాలో దాదాపు పాతికేళ్ల పాటు ఉన్న ఓ కుటుంబం.. అద్భుతమైన కెరీర్, అపారమైన ఆదాయం సంపాదించుకున్నారు... కానీ ఎందుకో హఠాత్తుగా ఇండియాకు తిరిగొచ్చేయాలనే ఆలోచన చేస్తోంది ఓ ఎన్ఆర్ఐ కుటుంబం. వ్యక్తిగత గోపత్య కోసం వారి పేర్లను వెల్లడించడకపోయినా.. రెడ్డిట్ అకౌంట్లో పంచుకున్న స్టోరీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నలభైల్లో ఉన్న ఈ దంపతులు.. 21 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసమని అమెరికాకు వెళ్లారు. అక్కడ ఉద్యోగం సంపాదించి స్థిరపడ్డారు. కానీ.. ఇప్పుడు అమెరికాని వదలేయాలని తీసుకున్న 'హోమ్ కమింగ్' డెసిషన్ టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.


  కొయంబత్తూర్‌కు చెందిన ఈ కుటుంబం ఆర్థిక స్థితి చాలా పటిష్టంగా ఉంది. వారి వద్ద మొత్తం ఆస్తి విలువ 6.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.56 కోట్లు). అమెరికాలో 3 మిలియన్ డాలర్లు విలువైన ఇల్లు ఉంది. దానిపై అప్పు కూడా చాలా తక్కవుంది. మరో నాలుగేళ్లలో ఇంటి విలువను తీసివేసి, 5 మిలియన్ డాలర్ల లిక్విడ్ ఆస్తులను కూడబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. అన్నీ ఉన్నా కూడా వాళ్లు భారత్‌కు వచ్చేయాలని డిసైడ్ అయ్యారు.


అంత సంపద, స్థిరమైన అమెరికా జీవితాన్ని వదులుకోవడానికి ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలు చెబుతున్నారు. ఒకటి, వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రుల బాధ్యత తీసుకుని వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనుకోవడం.. అంతే కదా.. ఎంత సంపాదించినా... కన్నవారిని ఆఖరి రోజుల్లో అయినా దగ్గరుండి చూసుకోకపోతే అదేం జీవితం అని వారి వాదన. ఇక రెండోది, అమెరికాలో పుట్టి పెరిగిన తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, విలువలను నేర్పించాలనుకోవడం. ఈ రెండు రీజన్స్ వల్లే ఈ కుటుంబం కోయంబత్తూరులో స్థిరపడాలని ప్లాన్ చేస్తోంది.


అయితే, ఈ నిర్ణయంపై కొందరు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ‘20 ఏళ్లు విదేశాల్లో ఉండి, భారత వాతావరణానికి అలవాటు పడతామనుకోవడం తెలివి తక్కువ పని’ అని ఇటీవలే అమెరికా వచ్చిన వారు హెచ్చరించారు. భారీ శబ్దాలు, కాలుష్యం వంటి సవాళ్లను ఎలా ఎదుర్కొంటారని నెటిజన్లు ప్రశ్నించారు. అయినప్పటికీ, తిరిగి ఇండియాకు వచ్చి సక్సెస్ అయినవారు కూడా ఉన్నారు. ఇంకో నెటిజన్ మాత్రం ‘25 ఏళ్లు అమెరికాలో ఉండి బెంగళూరుకు వచ్చాను. ఇక్కడ సామాజిక జీవితం అద్భుతం. తక్కువ ఖర్చుకే సహాయం దొరుకుతుంది. ఆన్‌లైన్ సర్వీసులు వేగంగా ఉంటాయి’ అని ఈ నిర్ణయాన్ని సమర్ధించారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు.


ఈ స్టోరీ ఏ ఒక్కరికో.. డబ్బుకు సంబంధించింది కానే కాదు... ఇది భావోద్వేగాలు, ప్రాక్టికాలిటీకి మధ్య పోరాటం. అపారమైన సంపద ఉన్నా.. తల్లిదండ్రుల పట్ల బాధ్యత, సొంత సంస్కృతి పట్ల మమకారం ఈ కుటుంబాన్ని స్వదేశానికి రప్పిస్తోంది. సుదీర్ఘ కాలం విదేశాల్లో ఉన్న తర్వాత భారత్‌కు రావడం ఒక సవాలే.. అయినా, ఈ కుటుంబం స్టోరీ చాలా మంది ఎన్‌ఆర్‌ఐలను ఆలోచింపజేస్తోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa