ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విషాదం.. ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 11:04 AM

AP: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆలమూరు మండలం చిలకలపాడులో పావులూరి కామరాజు (35) తన ఇద్దరు పిల్లలని (అభిరామ్‌ (10), గౌతమ్‌ (7)) చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై నరేశ్‌ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కామరాజు గతంలో వాలంటీర్‌గా పనిచేశాడు. 2020లో భార్య ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత ఇద్దరు పిల్లలతో జీవితం సాగించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa