ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్ర సంస్థ హమాస్ అంతం కాలేదు.. పాకిస్తాన్‌లో పురుడుపోసుకుంటోంది.. షాకింగ్ నినేదిక

international |  Suryaa Desk  | Published : Tue, Oct 21, 2025, 07:19 PM

రేండేళ్ల క్రితం అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో మారణహోమం సృష్టించింది హమాస్ ఉగ్ర సంస్థ. అనూహ్యంగా ఇజ్రాయెల్‌లోకి చొచ్చుకొచ్చి.. దాదాపు 1,219 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపారు హమాస్ ఉగ్రవాదులు. 251 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయారు. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ హమాస్‌నూ భూస్థాపితం చేస్తామని ప్రతిజ్ఞ చేసి.. రెండేళ్లుగా హమాస్‌పై భీకర దాడులు చేస్తోంది. ఈ దెబ్బకు హమాస్ పెద్ద తలకాయలన్నీ లేచిపోయాయి. హమాస్ అంతం అవుతుందన్న క్రమంలో.. అమెరికా జోక్యంతో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. హమాస్ ఇంకా అంతం కాలేదని.. పాకిస్తాన్‌ వేదికగా మళ్లీ పురుడుపోసుకుంటోందని ఓ నివేదిక వెల్లడించింది.


పీఓకేలో హమాస్..


పాకిస్తాన్ ఇప్పుడు హమాస్ ఆపరేటివ్స్‌కు కొత్త వేదికగా మారిందని అమెరికాకు చెందిన మిడిల్ ఈస్ట్ మీడియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (MEMRI) తన నివేదికలో పేర్కొంది. గాజాలో హమాస్‌ను డీమిలిటరైజ్ చేయడంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించిందని.. కానీ ఆ ఉగ్రవాద సంస్థ.. తన పునరుజ్జీవనం కోసం పాకిస్తాన్‌నూ వేదికగా ఎలా అభివృద్ధి చేసుకుంటుందో విస్మరించలేమని తెలిపింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్.. హమాస్ భావజాలానికి స్వర్గధామంగా మారుతున్నాయనేవి కేవలం భయాలు, ఊహలు మాత్రమే కాదని వెల్లడించింది. కార్యరూపం దాల్చుతున్నట్లు తెలిపింది. ఇలా హమాస్‌కు కొత్త గ్రౌండ్‌గా మారడం వల్ల.. ఉగ్రవాదంపై పాకిస్థాన్ పోరాటన్ని ప్రశ్నార్థకం చేస్తుందని నివేదిక చెప్పింది. నాటోయేతర అమెరికా మిత్ర దేశంగా కూడా పాకిస్తాన్ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని తెలిపింది.


"అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసినప్పటి నుంచి.. పాకిస్తాన్‌లోని హమాస్ ప్రత్యేక ప్రతినిధి నాజీ జహీర్‌ను గౌరవ మర్యాదలు అందుకుంటున్నారు. గౌరవ అతిథిగా ర్యాలీలు, సమావేశాలకు.. పాకిస్తాన్ ప్రభుత్వం అతడిని ఆహ్వానిస్తోంది. అంతేకాకుండా నాజీ జహీర్.. పాకిస్తాన్‌లో ఉన్న అమెరికా నిషేధిత ఉగ్రవాద గ్రూపులు.. లష్కరే తోయిబా, జైషే ముహమ్మద్‌లతో వేదికను పంచుకుంటున్నారు. పాకిస్తాన్‌లో నాజీ జహీర్ ఉనికి.. హమాస్ పట్ల ఇస్లామాబాద్ వ్యవహరిస్తున్న తీరును స్పష్టం చేస్తోంది" అని MEMRI నివేదిక పేర్కొంది


"2023 అక్టోబర్ నుంచి పాకిస్తాన్‌లో జహీర్ ఉనికి చాలా విస్తరించింది. పాలస్తీనా అనుకూల ఎజెండాను.. జిహాదిస్ట్ నెట్‌వర్కింగ్‌తో కలిపే హై-ప్రొఫైల్ ఈవెంట్‌లలో అతడు పాల్గొంటున్నాడు. హమాస్ ప్రత్యేక ప్రతినిధిగా దేశంలో నివసిస్తున్నారు. ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రభుత్వ సంస్థల నుంచి ప్రశంసలు అందుకుంచున్నారు" అని MEMRI ప్రాజెక్ట్ డైరెక్టర్ అన్నా మహజర్ బర్దుకి అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa