ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు బిగ్ షాక్.. ఫీజులు భారీగా పెంపు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:39 PM

ప్రపంచ దేశాల్లో చాలా మంది విద్యార్థులు.. ఉన్నత విద్య కోసం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు వెళ్తూ ఉంటారు. భారత్ నుంచి కూడా ఏటా ఎంతో మంది విదేశాలకు వెళ్లి.. పెద్ద చదువులు చదువుతున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత.. ప్రపంచ దేశాలకు చెందిన విద్యార్థులు అమెరికా వెళ్లాలనే నిర్ణయంపై మరోసారి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలకు వెళ్లి చదువుకునేందుకు.. చాలా మంది విద్యార్థులు ఆశపడగా.. తాజాగా బ్రిటన్ కూడా బ్యా్డ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏటా యూనివర్సిటీలు ఫీజుల పెంపు చేపట్టడానికి అంగీకారం తెలిపింది. అయితే విద్యార్థులకు సరైన బోధన అందించే వర్సిటీలకే ఈ ఫీజుల పెంపు నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది.


ఆయా యూనివర్సిటీలు బోధనలో ఉత్తమ నాణ్యతా ప్రమాణాలను చేరుకోగలిగితేనే ద్రవ్యోల్బణం ఆధారంగా ట్యూషన్ ఫీజులను పెంచడానికి అనుమతిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్కరణలు తీసుకురావడం వెనుక ప్రధాన లక్ష్యం.. విద్యార్థులు చెల్లించే ఫీజులకు తగిన బోధనను అందించడంతోపాటు యూనివర్శిటీల ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడటమేనని తెల్చి చెప్పింది.


మొదటి రెండేళ్ల తర్వాత.. ఫీజు పెంపు పూర్తిగా మెరుగైన బోధన, విద్యార్థి ఫలితాలు, పాస్టోరల్ సపోర్ట్‌ (విద్యార్థులకు మానసిక, ఇతర మద్దతు)పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. నాణ్యత లేని సంస్థలకు ఫీజు పెంపు ఉండదని.. పైగా జరిమానాలు కూడా విధించే అవకాశం ఉంటుందని వెల్లడించింది. విద్యార్థులు తీసుకునే మెయింటెనెన్స్ లోన్‌లు కూడా ఏటా పెరుగుతాయని పేర్కొంది. ఈ సంస్కరణల్లో భాగంగా.. వృత్తి విద్య కోసం వీ-లెవెల్స్ అనే కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.


2026-2027 అకడమిక్ ఇయర్ నుంచి.. అన్ని సంస్థలకు 2 ఏళ్లపాటు ఫీజు పెంపు లభిస్తుందని తెలిపింది. విద్యార్థుల నుంచి యూనివర్శిటీలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు.. వారు ఆశించే వరల్డ్ క్లాస్ టీచింగ్‌ను కూడా ద్యను అందించడం సరైందేని.. బ్రిటన్ విద్యా శాఖ కార్యదర్శి బ్రిడ్జెట్ ఫిలిప్‌సన్ తెలిపారు. నాణ్యతను పట్టించుకోని విశ్వవిద్యాలయాలు ఫీజులు పెంచేందుకు అనుమతి పొందవని.. అంతేకాకుండా అవి ఫైన్లు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె తీవ్ర హెచ్చరికలు చేశారు.


ఇటీవల సెప్టెంబర్‌లో ఇంగ్లాండ్‌లో 8 ఏళ్లలో మొదటిసారిగా ట్యూషన్ ఫీజులు.. 9,535 పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.11 లక్షలకు పైగానే పెరిగాయి. అయినప్పటికీ.. ఆఫీస్ ఫర్ స్టూడెంట్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం.. అదనపు మద్దతు లేకుండా 43 శాతం యూనివర్సిటీలు ఆర్థిక లోటును ఎదుర్కొనే ప్రమాదం ఉందని తెలిపింది. విద్యార్థుల ఇబ్బందులను తగ్గించడానికి.. ఫీజుల పెంపుతో పాటు మెయింటెనెన్స్ లోన్‌లు కూడా ప్రతి సంవత్సరం ఆటోమేటిక్‌గా పెరుగుతాయని పేర్కొంది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు మరింత ఎక్కువ లోన్లు ఇస్తారని వెల్లడించింది.


ఈ ఫీజుల ప్రణాళిక విస్తృతమైన పోస్ట్-16 విద్య, నైపుణ్యాల వైట్ పేపర్‌లో భాగం. దీనిలో భాగంగా వృత్తి విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్నారు. దాదాపు 900 టెక్నికల్ కోర్సుల (బీటెక్ వంటి కోర్సులు) స్థానంలో వీ-లెవెల్స్ అనే కొత్త వృత్తిపరమైన అర్హతలను ప్రవేశపెట్టారు. ఇది విద్యార్హత వ్యవస్థను సరళీకృతం చేసి.. ఉద్యోగ మార్గాలను బలోపేతం చేస్తుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.


జీసీఎస్ఈ మ్యాథ్స్, ఇంగ్లీష్ పరీక్షల్లో పాస్ కాని విద్యార్థుల కోసం తిరిగి పరీక్షలకు సిద్ధం చేయడానికి వీలుగా కొత్త స్టెప్పింగ్ స్టోన్ అర్హతను కూడా ప్రతిపాదించారు. విద్యా వ్యవస్థలో యూకే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ సంస్కరణలు.. ఉన్నత విద్యలో ఆర్థిక ప్రోత్సాహకాలను బోధన నాణ్యతతో ముడిపెడుతూ.. వృత్తి విద్య ఎంపికలను విస్తరిస్తూ.. బ్రిటన్ విద్య విధానంలో సమగ్ర మార్పును సూచిస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa