ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలకు జేషే ఉగ్రవాద సంస్థ ఆన్‌లైన్ జీహాద్ కోర్సు ఆఫర్

international |  Suryaa Desk  | Published : Wed, Oct 22, 2025, 08:40 PM

పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జమాతుల్ ముమినాత్ అనే మహిళా విభాగాన్ని సృష్టించి, దీని ద్వారా మహిళలకు జీహాద్ శిక్షణ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘తుఫత్ అల్-ముమినాత్’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ కోర్సును ఉగ్రవాద సంస్థ ప్రారంభించింది. దీని ద్వారా నిధులు సేకరణ, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్లను చేపట్టనుంది. ఈ కోర్సులో భాగంగా జైషే నాయకుల కుటుంబసభ్యులు, ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ బంధువులు, అతడి కమాండర్లు.. జీహద్, ఇస్లాం గురించి, వారి విధుల గురించి ఇతరులకు బోధిస్తారు. ఆన్‌లైన్‌‌లో నిర్వహించే ఈ నియామక ప్రక్రియ నవంబరు 8 నుంచి ప్రారంభం కానుంది.


‘ఉపన్యాసాలు’ రోజుకు కనీసం 40 నిమిషాల పాటు ఉంటాయి. మసూద్ అజార్ ఇద్దరు సోదరిలు సాదియా అజార్, సమైరా అజార్‌లు దీనికి నాయకత్వం వహిస్తారు. ఈ ఉపన్యాసాల ద్వారా మహిళలు జమాత్ ఉల్-ముమినాత్‌లో చేరేలా ప్రోత్సహించనున్నారు. మసూద్ పెద్ద చెల్లెలు సాదియా జమాతుల్ ముమినాత్‌ బాధ్యతలు చేపట్టినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం బహావల్పూర్‌పై భారత్ సైన్యం జరిపిన దాడిలో మసూద్ కుటుంబానికి చెందిన పలువురు హతమవ్వగా.. వారిలో సాదియా భర్త కూడా ఒకరు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాది ఉమర్ ఫరూక్ భార్య అఫ్రీర్ ఫరూక్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.


ఇదిలా ఉండగా, అజార్ నిధుల సేకరణను ముమ్మరం చేశారు. గత నెల బహావల్పూర్‌‌లోని మర్కజ్ ఉస్మాల్ ఓ అలీలో బహిరంగ సభ తర్వాత విరాళాల సేకరణపై అతడు ఫోక్ పెట్టారు. ఇక, మహిళలకు జీహాద్‌లో శిక్ష కోర్సుకు ఎంట్రీ ఫీజును రూ.500 పాకిస్థానీ రూపాయిలు (రూ.156)గా నిర్ణయించారు. ఇందులో చేరాలనుకుంటే ఈ మొత్తాన్ని చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది.


పాకిస్థాన్‌లో మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లడానికి అనుమతించని తీవ్రవాద సామాజిక నిబంధనలపై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకోడానికి జేషే ఈ ఆన్‌లైన్ విభాగాన్ని ప్రవేశపెట్టింది. రూ.500 ఫీజు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఫ్) నిబంధనలు అమలు చేశామని చెప్పుకునే పాక్ ద్వంద్వ ప్రమాణాలను నొక్కి చెబుతుందని వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 8న అజార్ జమాత్ మహిళా విభాగాన్ని ప్రకటించాడు. అక్టోబర్ 19న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మహిళలను ఇందులో చేరడానికి 'దుఖ్తరన్-ఎ-ఇస్లాం' అనే కార్యక్రమం నిర్వహించారు. బహావల్పూర్‌ సహా పీఓకేలో ధ్వంసమైన స్థావరాలను పునరుద్దరణకు ప్రయత్నాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa