ఆసియా కప్ ఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఓడించి టైటిల్ గెలిచినప్పటికీ, నెల రోజులు దాటినా విజేత ట్రోఫీ ఇంకా భారత్కు చేరలేదు. ఈ వివాదంపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. మరో రెండు రోజుల్లో ట్రోఫీ తమకు అందకపోతే, ఈ విషయాన్ని నవంబర్ 4న ఐసీసీ దృష్టికి తీసుకెళతామని బీసీసీఐ స్పష్టం చేసింది.దుబాయ్లో జరిగిన ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్పై గెలిచి ఛాంపియన్గా నిలిచింది. అయితే, బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి, ఏసీసీ, పీసీబీ ఛైర్మన్ కూడా అయిన మొహిసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించేందుకు భారత జట్టు నిరాకరించింది. అంతకుముందు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, పాక్ కెప్టెన్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. దీంతో ట్రోఫీ ప్రదానోత్సవం గంటకు పైగా ఆలస్యమైంది. చివరకు ఎలాంటి వివరణ లేకుండానే ట్రోఫీని మైదానం నుంచి తీసుకువెళ్లారు.ఈ ప్రతిష్టంభనపై బీసీసీఐ సంయుక్త కార్యదర్శి దేవజిత్ సైకియా పీటీఐ వీడియోతో మాట్లాడుతూ.గెలిచి నెల దాటినా ట్రోఫీ మాకు ఇవ్వకపోవడంపై కాస్త అసంతృప్తితో ఉన్నాం. ఈ విషయాన్ని మేము పరిశీలిస్తున్నాం. పది రోజుల క్రితం ఏసీసీ ఛైర్మన్కు లేఖ రాశాం, అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు. ఒకటి రెండు రోజుల్లో ట్రోఫీ ముంబైలోని మా కార్యాలయానికి చేరుతుందని ఆశిస్తున్నాం" అని తెలిపారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే నవంబర్ 4న దుబాయ్లో జరిగే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన స్పష్టం చేశారు. "భారత ప్రజలకు నేను హామీ ఇస్తున్నా.. ట్రోఫీ కచ్చితంగా భారత్కు వస్తుంది. కాస్త ఆలస్యం కావచ్చు అంతే అని సైకియా ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa