దొంగ బాబాల మోసాల గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటాయి. అయిత వారి చేతుల్లో మోసపోతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. దొంగ బాబాల మీద నమ్మకంతో.. ఇంకా అలాంటి వారిని చాలా మంది ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఓ దొంగ బాబాను నమ్మి ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్ నట్టేట మునిగాడు. ఉన్నదంతా అమ్ముకుని బాబాకు రూ. 14 కోట్లు ముట్టజెప్పాడు. అయినా తన సమస్య తీరకపోవడంతో నడిరోడ్డును పడ్డాడు. కానీ ఈ డబ్బుతో నిందితులు రిచ్ ఏరియాలో విలాసవంతమైన బంగ్లా కొనడం గమనార్హం. చివరికి తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పూణేకు చెందిన దీపక్ డోలస్ అనే ఐటీ ఇంజనీర్ కుమార్తె అనారోగ్యం బారిన పడింది. ఈ నేపథ్యంలో ఆమె రోగం ఎలాగైనా నయం చేయాలని దీపక్ అనుకున్నాడు. అందుకోసం అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో బాబాలను కూడా కలిశాడు. అలా బాబా రాజేంద్ర కడ్కే, ఆమె శిష్యురాలు వేదికా పంధపుర్కర్తో దీపక్కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరు.. 1947లో శంకర్ మహరాజ్ అనే ఓ బాబా చనిపోయాడని.. ఆయన ఆత్మ వేదిక శరీరంలో ఉందని దీపక్కు చెప్పారు. అది అతడి కుమార్తె అనారోగ్యాన్ని నయం చేయగలదని నమ్మించారు. దీన్ని పూర్తిగా నమ్మితేనే తన కుమార్తె అనారోగ్యం తగ్గుతుందని బ్రెయిన్ వాష్ చేశారు.
తన ఆస్తిని మాహరాజ్కు విరాళం ఇస్తే.. తన కుమార్తె రోగం నయం అవుతుందని దీపక్కు చెప్పారు. ఇలా గత ఏడు ఏళ్లుగా.. శంకర్ మహరాజ్ దర్శనం కల్పిస్తామని నమ్మించాడు దొంగ బాబా. కూమార్తె అనారోగ్యంతో మానసికంగా కుంగిపోయి.. నిస్సహాయ స్థితిలో ఉన్న దీపక్.. దొంగ బాబా, అతడి శిష్యురాలు చెప్పిన మాటలను నమ్మాడు. క్రమంగా పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పడం ప్రారంభించాడు. మొటదగా అతడి బ్యాంక్ అకౌంట్లో ఉన్న సేవింగ్స్ అన్నీ దొంగ బాబాకు ఇచ్చేశాడు. అనంతరం యూకేలో ఉన్న తన ఇల్లు, ఫామ్ హౌజ్ కూడా అమ్మేసి.. డబ్బులు ముట్టజెప్పాడు. ఇలా దీపక్ తన వద్ద ఉన్న సేవింగ్స్, ఆస్తి.. అంతా కలిపి రూ. 14 కోట్ల వరకు నిందితులకు ఇచ్చాడు.
ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేసినా.. తన కుమార్తె ఆనారోగ్యం నయం కాకపోవడంతో దీపక్.. దొంగ బాబా, అతడి శిష్యురాలు వేదికను నిలదీశాడు. అనంతరం తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీపక్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. అయితే విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. బాధితుడి వద్ద దోచేసిన డబ్బులో కొంత మొత్తంతో.. పూణేలోని కొథ్రుడి అనే ధనిక ప్రాంతంలో నిందితులు ఓ లగ్జరీ బంగ్లాను కొన్నట్లు తేలింది. కాగా రాజేంద్ర, వేదిక కలిసి.. దీపక్ లాగే ఇంకెంత మందిని మోసం చేశారు.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa