ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలు కిస్‌మిస్ తింటే ఎన్ని లాభాలో తెలుసా

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Nov 08, 2025, 11:01 PM

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందుకే, ధర కాస్తా ఎక్కువైనా వీటిని మనం మన డైట్‌లో యాడ్ చేస్తుంటాం. వీటి వల్ల ఆరోగ్యానికి ఎంతగానో మేలు జరుగుతుంది. అందులో రైజిన్స్ కూడా ఒకటి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు అందుతాయి. ఈ ఫ్రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి, బ్రెయిన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఎండుద్రాక్షని పిల్లలకి తినిపించడం వల్ల వారికి సరైన విధంగా పోషకాలు అందుతాయని చెబుతున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్. పిల్లలకి తినిపించడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటంటే


బ్రెయిన్ యాక్టివ్‌గా


పిల్లలు షార్ప్‌గా ఉండాలని ప్రతీ తల్లిదండ్రి అనుకుంటారు. అందుకోసం వారికి ఎన్నో విధాలుగా కష్టపడతారు. ఫుడ్ దగ్గర్నుంచీ రకరకాల గేమ్స్ ఆడిపించడం వరకూ, ఫజిల్స్ వరకూ ఇలా ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటారు. బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది. జ్ఞాపకశక్తి కూడా మెరుగ్గా ఉంటుంది. అలా కోరుకునేవారు పిల్లల చేత ఎండుద్రాక్ష తినిపించండి. ఇందులో ఐరన్, విటమిన్ బి పిల్లల జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తినిపించడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే పిల్లలకి వచ్చే సీజనల్ ప్రాబ్లమ్స్ చాలా వరకూ తగ్గుతాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు దూరమవుతాయి. ఎండుద్రాక్షలో పిల్లలకి మేలు చేసే గుణాలు ఉన్నాయి.


రక్తహీనత తగ్గేందుకు


ఎండుద్రాక్షలో హిమోగ్లోబిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అంతేకాకుండా, ఎనర్జీగా ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం చాలా వరకూ తగ్గుతుంది. పిల్లలకి, పెద్దలకి ఐరన్ చాలా ముఖ్యం. కాబట్టి, వీటిని తినిపించండి. ఎవరైతే పిల్లలు ఎప్పుడు నీరసంగా ఉంటారో అప్పుడు పిల్లలకి ఈ ఎండుద్రాక్షలు తినిపించడం వల్ల అందులోని సహజ చక్కెరలు పిల్లలకి తక్షణ శక్తిని అందిస్తాయి.


ఎముకలు బలంగా మారేందుకు


ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని పిల్లలకి తినిపించడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. ఎదిగే పిల్లలకి, అదే విధంగా, వృద్ధాప్యంలో ఎండుద్రాక్షలు తింటే ఎముకలకి సంబంధించిన సమస్యలు రావు. పైగా పిల్లలకి ఎముకలు బలంగా ఎదుగుతాయి. పాలు తాగనని మారాం చేసే పిల్లలకి వీటిని తినిపించడం వల్ల మేలు జరుగుతుంది.


జీర్ణ సమస్యలు


ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతుంది. జీర్ణ సమస్యలైన ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం తగ్గుతుంది. కాబట్టి, ఎండుద్రాక్షని మీ డైట్‌లో యాడ్ చేసుకోవడం మంచిది.


ఆకలి అయ్యేందుకు


కొంతమంది పిల్లల తినని మారాం చేస్తుంటారు. అలాంటి వారికి ఎండుద్రాక్షలు తినిపించడం వల్ల వారిలో ఆకలి పెరుగుతుంది. హ్యాపీగా అన్నం తింటుంటారు. అంతేకాకుండా, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ పిల్లల చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. అంతేకాకుండా, ఇందులోని గుణాలు పిల్లలకి కంటిచూపుని మెరుగ్గా చేస్తాయి. ఇందులో కళ్ళకి మేలు చేసే విటమిన్ ఎ ఉంటుంది.


ఎప్పట్నుంచీ, ఎలా తినిపించొచ్చు. 


పిల్లలకి ఈ ఎండుద్రాక్షల్ని 8 నుంచి 10 నెలల నుంచి తినిపించొచ్చు. ఆ వయసులో నేరుగా తినలేరు. కాబట్టి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇవ్వొచ్చు. ఉగ్గులో, వారి ఫుడ్స్‌లో చిన్న ముక్కలుగా చేసి యాడ్ చేసి ఇవ్వొచ్చు. దీంతో పాటు, కొంతమంది పిల్లలు ఎండుద్రాక్షల్ని తినడానికి ఇష్టపడరు. అలాంటివారికి ఎండుద్రాక్షల్ని నానబెట్టి ఆ నీరు తాగించొచ్చు. దీనికోసం గ్లాసు నీటిలో 4 ఎండుద్రాక్షల్ని వేసి రాత్రంతా నానబెట్టి మరుసటి ఉదయమే ఆ నీటిని తాగించాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa