ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుజరాత్‌ జైల్లో హైదరాబాద్‌ ఉగ్రవాది అహ్మద్‌ను చితకబాదిన తోటి ఖైదీలు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 08:31 PM

ఆముదం గింజల నుంచి విషం తయారు చేసి.. దాన్ని ప్రసాదంలో కలిపి.. అమాయకుల ప్రాణాలు తీయాలని భావించిన హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. ఈక్రమంలో కీలక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. జైలులో ఖైదీలు కొందరు అతడిపై దాడి చేసి చితకబాదారని సమాచారం. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)తో సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్‌పై జైలు లోపల దాడి జరిగింది. అతడిని హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ.. అకస్మాత్తుగా వచ్చిన ఖైదీలు అహ్మద్ మీద దాడి చేసి తీవ్రంగా కొట్టారని అధికారులు తెలిపారు.


ఖైదీల మధ్య దాడి తీవ్రంగా జరిగిందని.. అహ్మద్‌ను ఖైదీల నుంచి విడిపించేందుకు, అతడి ప్రాణాలు కాపాడేందుకు చివరకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దీని గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది. దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంది. అసలు దాడి ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. ఖైదీలు ఎందుకు ఇంత అకస్మాత్తుగా దాడి చేశారు అనే దాని గురించి ఇంకా తెలియదలేదు.


ఈ నెల అనగా నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిలో హైదరాబాద్‌ నగరానికి చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మొహియుద్దీన్.. ఐసీస్‌కు చెందిన ఓ డిపార్ట్‌మెంట్ అయిన.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌ అనే వ్యక్తితో టచ్‌లో ఉన్నట్లు.. అతడి ఆదేశాల మేరకు పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్.. అబుల్ ఖాదీమ్ ఆదేశాల మేరకు ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే ప్రమాదకరమైన విషాన్ని తయారు చేయడానికి ఇంట్లోనే అన్ని పరికరాలు ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొహియుద్దీన్.. మరో ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుంటాడని విచారణలో తెలిసింది. అబూ ఖాదీమ్ పాక్‌–అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్నాడని.. దర్యాప్తులో వెల్లడైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa