ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాడిన నూనెను మళ్లీ వాడితే.. రూ.లక్ష జరిమానా

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 08:36 PM

అసలే చలికాలం.. సాయంత్రం చలి తీవ్రత మరీ ఎక్కువ అవుతోంది. ఆ సమయంలో వేడిగా ఏమైనా తింటే బాగుటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇళ్లలో చేసుకుని తినే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. బయట ఉండే బజ్జీల బండి దగ్గరకు వెళ్లి నచ్చిన స్నాక్స్ తెచ్చుకుని తింటాము. అయితే అక్కడ వాడే పదర్థాల ఎంత నాణ్యతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక వారు వాడే నూనె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని ప్రాంతాల్లో వాడే నూనె చూస్తే.. అది ఆయిలో లేక ఇంజనాయిలో అర్థం కాని స్థితిలో ఉంటుంది. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వాడుతూ.. ప్రజల ఆరోగ్యాలతో ఆటాలడుతుంటారు. అయితే ఇకపై ఇలా చేయలేరు. వాడిని నూనెని మళ్లీ మళ్లీ వాడితే లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. ఆ వివరాలు..


ఆహార పదార్థాల తయారీకి వాడే వంట నూనె విషయంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాడిని నూనెని తిరిగి వాడకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. హానికరమైన పద్దతుల్లో.. వాడిని నూనెని మళ్లీ వినియోగిస్తున్న వ్యక్తులు, వ్యాపార సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. వాడిని వంట నూనెను మూడు సార్ల కన్నా ఎక్కువ వినియోగిస్తే.. సదరు వ్యక్తులు, వ్యాపార సంస్థలపై రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది.


వాడిన నూనెని మళ్లీ మళ్లీ వాడకుండా చూసేందుకు కేరళ ఆహార భద్రతా కమిషనరేట్ ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఈట్ రైట్ ఇండియా' , 'రీపర్పస్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్' వంటి కార్యక్రమాల ద్వారా.. ఈ చర్యలకు పూనుకుంటుంది. దీని ప్రకారం.. నూనెను మూడు సార్లకు మించి వినియోగించరాదు. 3 సార్లు వాడిన తర్వాత.. దాన్ని తప్పనిసరిగా బయో-డీజిల్ ఉత్పత్తి చేసేందుకు నియమించిన ఏజెన్సీలకు అప్పగించాలి. అలా చేయకుండా ఆ నూనెను తిరిగి ఉపయోగించే వారికి లక్ష రూపాయల జరిమానా విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.


బయో డీజిల్ ఉత్పత్తి కోసం నియమించి ఈ ఏజెన్సీలు వాడిన నూనెను లీటరుకు రూ.50–60కి కొని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు అందజేస్తాయి. అయితే ఆహార పదర్థాల తయారీ కోసం వాడిని నూనెని మళ్లీ మళ్లీ వాడితే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం.. రోజుకు 50 లీటర్ల కంటే ఎక్కువ నూనె వినియోగించే.. ఆహార పదర్థాల తయారీ కంపెనీలు, హోటళ్లు తప్పనిసరిగా వాడిన నూనెను అధీకృత ఏజెన్సీలకు అప్పగించాలి.


కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే 100 కంటే ఎక్కువ సంస్థలు ఈ రూల్స్‌ని పాటిస్తున్నాయి. అలాగే నెలకు సగటున 10వేల లీటర్ల వాడిన నూనెను ఏజెన్సీలకు అందజేస్తున్నాయి. ఇక వంట నూనెను తిరిగి ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాల గురించి జనాలకు అవగాహన కల్పించడానికి అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa