భారత్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీ హత్య కేసులో ప్రధాన నిందుతు మాత్రమే కాక.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు అయిన అన్మోల్ బిష్ణోయ్ని అమెరికా బహిష్కరించింది. దీని గురించి అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం మంగళవారం నాడు అంటే నవంబర్ 18న ఒక ప్రకటన చేశారు. అన్మోల్ బిష్ణోయ్ని అమెరికా నుంచి అధికారికంగా బహిష్కరించినట్లు ప్రకటించింది.అన్మోల్పై అగ్రరాజ్యం బహిష్కరణ వేటు వేయడంతో.. అతడిని భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది అంటున్నారు అధికారులు.
లారెన్స్ బిష్ణోయ్ ముఠా.. ఇండియాలోనే కాక.. కెనడాలో కూడా అనేక కిడ్నాప్లు, హత్యలు, బెదిరింపులు వంటి తీవ్ర నేరాలకు పాల్పడుంది. ఈ ముఠాలో కీలక సభ్యుడు, లారెన్స్ బిష్ణోయ్ సోదరుడైన అన్మోల్ కూడా అనేక నేరాల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గతంలో మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో పాటు పాటు సల్మాన్ఖాన్ నివాసంపై కాల్పుల కేసుతో పాటు అనేక ఇతర హై ప్రొఫైల్ కేసుల్లో అతడు ప్రధాన నిధితుడు. ప్రస్తుతం అమెరికా అతడిని బహిష్కరించడతో.. అన్మోల్ని ఇండియాకు రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చట్టపరమై. భద్రతా చర్యలు పూర్తి చేసిన తర్వాత.. అన్మోల్ బిష్ణోయ్ని ఇండియా దర్యాప్తు సంస్తలకు అప్పగిస్తామని అమెరికా అధికారులు తెలిపారు. అలానే అన్మోల్ బహిష్కరణ గురించి యూఎస్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం.. బాబా సిద్ధిఖీ కుమారుడు, ఎన్సీపీ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీకి ఈ మెయిల్ చేసింది. దీనిలో నవంబర్ 18న అన్మోల్ బిష్ణోయ్ను అధికారికంగా అమెరికా నుంచి బహిష్కరించినట్లు అందులో పేర్కొంది.
అయితే ఇప్పటికే అన్మోల్ బిష్ణోయ్పై జాతీయ దర్యాప్తు సంస్థ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. 2022లో నమోదైన రెండు కేసుల్లో అతడు అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అంతేగాకుండా బాబా సిద్ధిఖీ హత్యకు ముందు సైతం షూటర్లతో అన్మోల్ చాటింగ్ చేసినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న సల్మాన్ఖాన్ ఇంటివద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ అన్మోల్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న అన్మోల్ అక్కడి నుంచే ఇండియాలో నేరాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. అతడిని ఇండియా తీసుకొచ్చేందుకు భారత ఏజెన్సీలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో 2025, ఫిబ్రవరిలో అన్మోల్ అమెరికాలో అరెస్టు అయ్యాడు. యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం అతడిని పట్టుకుంది.
బిష్ణోయ్ లారెన్స్ ముఠా కేవలం ఇండియాలోనే మాత్రమే కాక.. అంతర్జాతీయంగా అనేక నేరాలకు పాల్పడుతుండటంతో.. ఈ గ్యాంగ్ను అణచివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడని గుజరాత్లోని సబర్మతి జైలులో ఉంచారు. అయితే లారెన్స్ బిష్ణోయ్.. జైలు నుంచి కూడా తన గ్యాండ్ను నడిపిస్తున్నాడని సమాచారం. ఈ గ్యాంగ్ ఇండియాలోనే కాక విదేశాల్లో సైతం కిడ్నాప్, దోపిడీ, హత్యలు, డ్రగ్స్, ఆయుధాల రవాణా వంటి నేర కార్యకలాపాలకు పాల్పడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa