ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీమిండియాను కించ పరిచేలా దక్షిణాఫ్రికా కోచ్ వ్యాఖ్యలు

sports |  Suryaa Desk  | Published : Wed, Nov 26, 2025, 10:57 PM

భారత గడ్డపై 25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇప్పటికే ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025 టైటిల్‌ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది. అయితే ఈ మ్యాచ్‌ నాలుగో రోజు ఆట తర్వాత దక్షిణాఫ్రికా హెడ్‌కోచ్‌ షుక్రి కాన్రాడ్‌.. టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.


తాము కావాలనే రెండో ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేశామని షుక్రి కాన్రాడ్‌ చెప్పాడు. “భారత జట్టును మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి.. ఆఖరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేయడం కోసమే ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా డిక్లేర్డ్ చేశాం. వాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయాలి. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. ఆఖరి రోజు ఆఖరి నిమిషం వరకు వాళ్లు పోరాడుతూనే ఉండాలి. చివరికి వారిపై మాదే పైచేయి అవుతుంది” అని నాలుగో రోజు ఆట తర్వాత షుక్రి కాన్రాడ్ అన్నాడు. ఈ కామెంట్స్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సహా.. దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్‌ విమర్శలు గుప్పించారు. ఇలాంటి వ్యాఖ్యలు అస్సలు కరెక్ట్ కాదని పేర్కొన్నారు.


అయితే ఇదే విషయంపై మ్యాచ్ తర్వాత కెప్టెన్ టెంబా బవూమాకు ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు బదులిస్తూ.. “మా కోచ్‌ మాట్లాడిన మాటల గురించి నాకు బుధవారం ఉదయమే తెలిసింది. నా ఫోకస్ మ్యాచ్ మీదే ఉంది. అందువల్ల దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదీకాకుండా ఆయనతో మాట్లాడేందుకు టైమ్ కూడా నాకు దొరకలేదు. ఆయనకు 60 ఏళ్లు ఉంటాయి. ఆయన తన కామెంట్స్‌ను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది” అన్నాడు. ఇదే సమయంలో టీమిండియా ఆటగాళ్లపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశాడు బవూమా. చాలా మంది ఆటగాళ్లు హద్దుమీరి ప్రవర్తించారని.. జస్‌ప్రీత్ బుమ్రా మరుగుజ్జు వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa