రాహుల్, ప్రియాంక గాంధీలపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశంసలు కురిపించారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ చాలా ప్రత్యేకత కలిగిన వ్యక్తులని, వారు మాట్లాడే విధానం కూడా ఇతరులకు భిన్నంగా ఉంటుందని, ఎవరితోనూ పోల్చలేమని అన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. ఇటీవల వందేమాతరంపై చర్చ సందర్భంగా రాహుల్, ప్రియాంక ప్రసంగాలను ప్రస్తావించారు. ‘వాళ్లు ఇద్దరూ ( రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీలు) యాపిల్స్, ఆరెంజెస్.. వేరే వ్యక్తులతో పోల్చలేం’ అని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.
కాగా, ప్రియాంకా గాంధీ తన ప్రసంగంలో మెరుపులు చూపించగా.. ఆమె కన్నా చాలా సీనియర్ అయిన రాహుల్ గాంధీ మాత్రం వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ, ఇక్కడ పరిగణనలోకి తీసుకోవలసిన విషయం ఏమిటంటే, ఇద్దరూ వేర్వేరు విషయాలపై మాట్లాడారు. అందువల్ల, ఏదైనా పోలిక ‘మానసిక విద్వేషం’అవుతుందని, సంబంధిత వ్యక్తులు ‘వారి అభిప్రాయానికి అర్హులు’ అని ఆమె వ్యాఖ్యానించారు.
‘ఆచరణాత్మకంగా ప్రియాంక గాంధీ చాలా మంచి వ్యక్తి... ఆమె తాను మాట్లాడాల్సిన దాని గురించే మాట్లాడింది. రాహుల్ వేరే విషయంపై మాట్లాడారు. ఆయన శైలి భిన్నంగా ఉంటుంది.. బత్తాయిలు, యాపిళ్లను ఎవరూ పోల్చలేరు. ఇది అలా పనిచేయదు. ఇవి చెప్పడానికి భిన్నమైన కథనాలు’ అని ఆమె ఎత్తి చూపారు.
‘‘మనమంతా చాలా స్టీరియోటైపిక్గా ఆలోచిస్తాం… ఒక నిర్దిష్టమైన స్పందన రావాలి.. అలా రావాల్సి ఉండకూడదు అనుకుంటాం.. కానీ అలా జరగదు. వివిధ వ్యక్తులు విషయాలను వేర్వేరుగా ప్రస్తావిస్తారు. నా అభిప్రాయం ఏమిటంటే ఇద్దరూ తమతమ స్థానం నిలబెట్టుకుని, అవసరమైన విషయాలనే ప్రస్తావించారు’’ అని రేణుకా చౌదరి అన్నారు. ఎవరూ మంచి వక్త? అని అడితే పోల్చడానికి ఆమె నిరాకరించారు. ‘వారు ఇద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులు.. అందువల్ల ఒకరు మంచివారు లేదా చెడ్డవారు అని చెప్పడం సరైంది కాదు’ అని రేణుకా చౌదరి పునరుద్ఘాటించారు.
వందేమాతరంపై పార్లమెంట్లో సోమవారం జరిగిన చర్చలో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగానికి అనూహ్య స్పందన లభించింది. రాహుల్ గాంధీ తన సోదరి ప్రసంగంపై ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీ నాయకుల చేసిన వ్యాఖ్యలకు పాయింట్ల వారీగా కౌంటర్ ఇచ్చారు.
ఆమె ప్రత్యేకంగా ప్రధాని వ్యాఖ్యలు ఎత్తి చూపిస్తూ.. జవహర్లాల్ నెహ్రూ మాటల్లో తన అనుకూలంగా ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటున్నారని మోదీకి కౌంటర్ ఇచ్చారు. అలాగే, నెహ్రూపై బీజేపీ తరచూ చేసే విమర్శలకు కూడా ఆమె ఘాటుగా ప్రతిస్పందించారు. ‘మీరు నెహ్రూ గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మనం ఒక పనిచేద్దాం. ఆయన గురించి మీరు మాట్లాడాలనుకున్న అంశాలన్నీ ఒక జాబితా చేసి అందుకోసం సమయం కేటాయించి చర్చిద్దాం. ఆ అధ్యాయాన్ని అక్కడితో ముగిద్దాం.. వందేమాతరం గురించి ప్రస్తుతం చర్చిస్తున్నట్టుగా నెహ్రూ గురించి చర్చించుకుందాం.. ప్రజలు మనల్ని ఎన్నుకున్న అసలు పనికి ఈ విలువైన సమయాన్ని వినియోగిద్దాం’ అని ఆమె పేర్కొంది.
ఆ మర్నాడు ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ ప్రసంగించి.. బీజేపీ, ఎన్నికల కమిషన్లపై విరుచుకుపడ్దారు. బీజేపీ, ఈసీలు కుమ్ముక్కై భారత ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ప్రజల గొంతును నొక్కేస్తున్నాయని ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa