ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూతన రైలు ప్రారంభం: గుంటకల్-మార్కాపూర్ రూట్‌లో రోజువారీ షెడ్యూల్

national |  Suryaa Desk  | Published : Tue, Dec 23, 2025, 09:05 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలను కలుపుతూ మరో కొత్త రైలు సేవ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ రైలు గుంటకల్లుతో మార్కాపురం రోడ్ స్టేషన్ను కలుపుతూ ప్రయాణించనుంది.దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ వివరాలను తాజాగా వెల్లడించారు. స్థానిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, రైలు ప్రారంభానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. రైలు నంద్యాల రూట్ మీదుగా ప్రయాణిస్తుంది.రైలు నం.57407/57408 గుంతకల్లు - మార్కాపూర్ రోడ్ - గుంతకల్లు ప్యాసింజర్ రైలు సర్వీస్ ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. రైలు నం.57407 గుంతకల్లుతో సాయంత్రం 5.30కి బయలుదేరి, రాత్రి 11.30కి మార్కాపూర్ రోడ్ చేరుతుంది. ఈ రైలు నంద్యాలలో రాత్రి 8.30కి ఆగనుంది.అలాగే రైలు నం.57408 మార్కాపూర్ రోడ్ నుంచి ఉదయం 10.30కి బయలుదేరి, సాయంత్రం 4.30కి గుంతకల్లుకు చేరుతుంది. ఈ రైలు నంద్యాలలో ఉదయం 7.20కి ఆగుతుంది.రైలు మార్గ మధ్య మద్దికెర, పెండేకల్లు, ధోన్, రంగాపురం, బేతంచెర్ల, పాణ్యం, నంద్యాల, గాజులపల్లి, దిగువమెట్ట, గిద్దలూరు, సోమిదేవిపల్లె, జగ్గంభొట్ల, కృష్ణాపురం, కంబం, తర్లుపాడు స్టేషన్లలో ఆగుతుంది.ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా గుంతకల్లు-మార్కాపూర్ రోడ్ మధ్య ప్రయాణించే వారికి మాత్రమే కాకుండా, మార్గ మధ్యని నంద్యాల, గిద్దలూరు, కంభం ప్రాంతాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుంది. రైలు విద్యార్థులు, వ్యాపారస్తులు మరియు సాధారణ ప్రయాణికులు తక్కువ ఛార్జీతో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa