ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిఫ్ట్ ఇస్తామని.. కదులుతోన్న వ్యాన్‌లో యువతిపై గ్యాంగ్ రేప్

national |  Suryaa Desk  | Published : Wed, Dec 31, 2025, 09:45 PM

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో సభ్యసమాజం తలదించుకునే దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. కదులుతున్న వ్యాన్‌లో ఓ మహిళపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో డిసెంబరు 30 సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఇటీవల రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ పార్టీకి అని పిలిచి ఐటీ మేనేజర్‌పై సీఈఓ సహా ఉద్యోగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 23 ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో అటుగా వెళ్తోన్న ఓ వ్యాన్ ఆమె వద్దకు వచ్చి ఆగింది. ఆమెకు లిఫ్ట్ ఇస్తామని, ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి ఇద్దరు యువకులు అందులోకి ఎక్కించుకున్నారు.


 కానీ, ఆమె ఇంటికి కాకుండా గురుగ్రామ్ రోడ్డు వైపు వాహనం మళ్లించి, రెండు గంటలకుపైగా కదులుతోన్న వ్యాన్‌లో ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలిపెట్టాలని బాధితురాలు కాళ్లావేళ్లాపడి వేడుకున్నా కనికరించలేదు సరికదా బెదిరింపులకు దిగారు. తనను రక్షించాలని ఆమె కేకలు వేసినా రోడ్డుపై ఉన్నవారికి వినిపించలేదు. రెండున్నర గంటల పాటు ఆమెకు నరకం చూపించి, చివరకు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎస్జీఎమ్ నగర్‌లోని రాజా చౌక్ వద్ద కదులుతున్న వ్యాన్ నుంచి ఆమెకు కిందకు తోసేశారు.


వాహనంలో నుంచి కిందపడి ముఖానికి తీవ్రగాయాలే రక్తమోడుతోన్న బాధితురాలు తన సోదరికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ముఖంపై గాయాలకు 10 నుంచి 12 కుట్లు వేసిన వైద్యులు.. ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ తీవ్ర షాక్‌కు గురైందని చెప్పారు. ఆమెకు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ, విబేధాలు కారణంగా ప్రస్తుతం భర్తతో దూరంగా ఉంటోంది. ఘటన జరగడానికి కొద్ది గంటల ముందు బాధితురాలు తల్లితో గొడవపడి స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నట్టు సోదరికి చెప్పింది.


‘‘ముందు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన సోదరికి ఫోన్ చేసిన ఆమె, తల్లితో గొడవ జరిగిందని, అందుకే తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. మూడు గంటల్లో ఇంటికి తిరిగి వస్తానని కూడా ఆమె తన సోదరికి తెలియజేసింది’’ అని బాధితురాలి సోదరి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. దారుణానికి పాల్పడిన వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కోలుకున్న తర్వాత బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్టు పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa