దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈసారి తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన జరగనుంది. తొలిదశలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇళ్ల వివరాలను సేకరిస్తారు.ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు హౌస్ లిస్టింగ్ మరియు గణన పనులు నిర్వహించబడతాయి. రెండో దశలో జనాభా లెక్కలు 2027 ఫిబ్రవరి-మార్చ్ వరకు సేకరించడానికి ఏర్పాట్లు చేస్తారు.ఆంధ్రప్రదేశ్లో ఈ జనగణన కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా, సబ్-డివిజనల్, సబ్-డిస్ట్రిక్ట్ స్థాయిల్లో ప్రత్యేక కమిటీల నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ప్రత్యేక జనగణన కమిటీలను ఏర్పాటు చేస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కసరత్తును సమర్థవంతంగా, లోపాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యం.జనగణన అధికారుల పనిలో అంతరాయం కలిగిస్తే జరిమానా, జైలు శిక్ష కూడా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు పూర్తి సహకారం చూపి సరైన సమాచారం అందించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.జనగణన ద్వారా సేకరించబడే డేటా భవిష్యత్తు విధానాల రూపకల్పనలో కీలకంగా ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థాయిల్లో సమన్వయంతో జనగణన కసరత్తు చేపట్టాలని, ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa