దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ నెలలో విడుదల చేసిన 21వ విడతలో భారీగా రైతుల పేర్లను తొలగించినట్లు సమాచారం. 22వ విడత సాయం విడుదలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో రైతుల్లో ఆందోళన నెలకొంది. పీఎం కిసాన్ లిస్టులో తమ పేరు ఉందో లేదో తనిఖీ చేసుకుంటున్నారు. పంట పెట్టుబడి సాయం కింద కేంద్రం ప్రతి ఏటా రూ.6 వేల చొప్పున మూడు విడతల్లో అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, గతేడాది లబ్ధిదారుల జాబితాలో భారీ కోత పెట్టారు. 20వ విడతతో పోలిస్తే 21వ విడతలో 70 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ జమ చేయలేదట. అందుకు చాలా కారణాలున్నాయని అధికారులు చెబుతున్నారు.
70 లక్షల మందికి ఎందుకు రాలేదంటే..
కేంద్ర ఈ పథకంలో పారదర్శకత పెంచేందుకు సాచురేషన్ డ్రైవ్ పేరుతో వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకొచ్చింది. అర్హత లేని, డూప్లికేట్ ఎంట్రీలు అయిన వారి పేర్లు, రికార్డుల్లో తప్పులు గుర్తించి జాబితా నుంచి రైతుల పేర్లను తొలగించారు. సుమారు రూ. 2500 కోట్ల మేర ప్రభుత్వ సొమ్ము ఆదా చేసినట్లు అధికారులు తెలిపారు.
బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కాకపోవడం లేదా డీబీటీ ఎనేబుల్ లేకపోవడం వంటి కారణాలతో డబ్బులు రాని వారు ఉన్నారు.
దరఖాస్తు సమయంలో ఇచ్చిన పేరు, ఆధార్ లోని పేరు తేడాగా ఉండటం.
ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోవడం.
పీఎం కిసాన్ పోర్టల్లో భూ రికార్డులు సరిగా లేకపోవడం వంటి కారణాలతో లక్షల మంది రైతులకు 21 విడత నిధులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.
ఇలా చెక్ చేసుకోండి...
రైతులు తమకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ pmkisan.gov.in సందర్శించాలి.
హోమ్ పేజీలో Farmers Corner లో ఉన్న 'Beneficiary Status'పై క్లిక్ చేయాలి.
మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే, పేమెంట్ ఎందుకు ఆగిపోయిందో కనిపిస్తుంది.
ఫిబ్రవరి-మార్చి నెలల్లో22వ విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రూ. 3.88 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ సాయం అందకుండా చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు ఈ ప్రయోజనాన్ని కోల్పోకుండా ఉండాలంటే వెంటనే రికార్డులను అప్డేట్ చేసుకోవడం మంచిది. సమీప మీసేవా కేంద్రానికి వెళ్లి లేదా మొబైల్ ద్వారా ఆధార్ ఓటీపీతో ఈ-కేవైసీ పూర్తి చేయాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ అయిందో లేదో బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లి కన్ఫార్మ్ చేసుకోవాలి. ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్నే పీఎం కిసాన్ పోర్టల్లో కూడా వినియోగించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa