ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ నేతలతో సమావేశమైన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 21, 2026, 03:31 PM

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు.   గతంలో ఒకసారి ఇలా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. కొంతకాలం తర్వాత తిరిగి, ఏలూరు నియోజకవర్గంతో ఆ తరహా సమావేశాలు ప్రారంభించారు. ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం అవుతానని, ఈ సందర్భంగా శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు.ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ...     నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యకర్తలతో గతంలో సమావేశమయ్యాం. మళ్లీ ఇప్పుడు ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నాం. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశం అవుతాం. చూస్తుండగానే దాదాపు రెండేళ్లు గడుస్తున్నాయి. వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. అంటే ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. అలాగే మిగిలింది మూడేళ్లు మాత్రమే. అందులో ఏడాదిన్నర తర్వాత నా పాదయాత్ర మొదలుపెడతాను. ఆ విధంగా దాదాపు ఏడాదిన్నర పాటు, నేను ప్రజల్లోనే, ప్రజలతోనే ఉంటాను అని భరోసా ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa