ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 17, 2026, 01:52 PM

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం... టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు.నిన్న 73,776 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 23,291 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్లు వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa