మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని 8వ వార్డు నుంచి సుమారు 200 మంది మహిళలు, యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు జిల్లా టీడీపీ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్, చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa