రాజమండ్రిలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ శిక్షణ తరగతులను రాష్ట్ర బీజేపీ కార్యదర్శి బొమ్ముల దత్తు మంగళవారం ప్రారంభించారు. ఈ రెండు రోజుల శిక్షణలో బీజేపీ నిర్మాణం, ప్రపంచంలో భారతదేశ పాత్ర, ఏకత్వం, మానవ దర్శనం వంటి 8 అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యెనుముల రంగబాబు, మండల అధ్యక్షులు చింతపల్లి సాయి, జిల్లా జనరల్ సెక్రటరీ స్వర్ణరజని పాల్గొన్నారు. ఈ శిక్షణ తరగతులు భాజపా జిల్లా కార్యాలయంలో జరుగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa