ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవిఎంలను నిందించడమెందుకు? : మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 03:15 PM

ప్రతిపక్షాల తమ లోపాలకు ఇవిఎంలను నిందిస్తున్నాయని, ఇవిఎంలను నిందించడమెందుకని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశ్నించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యావాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగా రాజ్యసభలో మోడీ మాట్లాడారు. ప్రతిపక్షాలకు తమతో పోరాడే సత్తా లేదని ఆయన అన్నారు. ఈ ఇవిఎంలతో 113 అసెంబ్లిd, 4 సాధారణ ఎన్నికలు జరిగాయని ఆయన చెప్పారు. ఇవిఎంలను నిందించడం ఒక జబ్బు అని ఆయన అన్నారు. ఎన్నికల సంస్కరణలు కొనసాగించాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌ ఓడిపోతే దేశ ఓటర్లు ఓడిపోయినట్లు కాదని ఆయన చెప్పారు. ఓటమిని కాంగ్రెస్‌ అంగీకరించలేకపోతోందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa