ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు: అవంతి శ్రీనివాస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2019, 03:44 PM

అక్రమ కట్టడాలను కూల్చాలంటే ఎంతో ధైర్యం కావాలని... ఆ ధైర్యం ముఖ్యమంత్రి జగన్ లో ఉంది కాబట్టే అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. సాక్షాత్తు సోనియాగాంధీ లాంటి వారినే ఎదిరించిన చరిత్ర జగన్ దని చెప్పారు. ఏపీలో టీడీపీ పని అయిపోయిందని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో సైతం వైసీపీ జెండా ఎగరాలని విశాఖ నేతలకు పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ నేతల అక్రమాలను భరించలేకే వైసీపీకి ప్రజలు 151 సీట్లను కట్టబెట్టారని చెప్పారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం ఉత్తర నియోజవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని అవంతి విమర్శించారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పని చేసి నగరాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పెన్షన్లను ఇస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa