ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోపణలు మానుకోండి టిడిపికి అవంతి హితవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2019, 08:44 AM

ప్రజా రంజకమైన పాలన ను సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజలకు అందజేస్తుంటే,  టీడీపీ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తూ, ప్ర‌జ‌ల‌లోకి వెళ్లాల‌ల‌ని చూస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు రాష్ట్ర మంత్రి  అవంతి శ్రీనివాస్,  నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ నియోజకవర్గ ఇంచార్జి లతో   ఆయ‌న స్థానిక  సర్క్యూట్ హౌస్ లో  సమావేశమై పార్టీ ప‌టిష్ట‌త‌పై చ‌ర్చించిన అనంత‌రం మీడియాలో మాట్లాడుతూ, త‌మ ప్ర‌భుత్వం ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని, ప‌లు ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యాయ‌ని, నాలుగు ల‌క్ష‌ల మంది నిరుద్యోగుల‌కు వ‌రుస ఉద్యోగాలు క‌ల్పించిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానిదేన‌న్నారు. అయినా ఓర్వ‌లేని త‌నంతో  టీడీపీ నాయకులు చవకబారు ఆరోపణలు చేస్తున్నార‌ని, ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకుని వారు చేసే తప్పుడు ఆరోపణలు  చేయడం మానుకోవాలని హితవు పలికారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa