ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హాస్యనటుడి మరణంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంతాపం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2019, 03:18 AM

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మరణంపై టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ షాక్‌కు గురయ్యాడు. వేణుమాధవ్ మరణవార్త చూసి షాకైనట్టు ఈ మేరకు యూసుఫ్ త‌న సంతాప సందేశంలో తెలియ‌జేశారు. 'వేణు మాధవ్ మరణ వార్త వినగానే షాక్‌కు గురయ్యాన‌ని, వెండితెరపై తాను చూసిన ది బెస్ట్ కమెడియన్ వేణుమాధవ్ అని అన్నారు యూసుఫ్ పఠాన్. తెలుగు చిత్రసీమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి' అని యూసుఫ్ పఠాన్ రాసుకొచ్చారు .తెలుగు సినిమా పరిశ్రమలో వేణుమాధవ్ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని అన్నాడు యూసుఫ్ పఠాన్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa