ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముఖ్యమంత్రి తిరుమ‌ల పర్యటనకు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 05:37 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన సెప్టెంబర్ 30న ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వ‌ర్యులు గౌ|| శ్రీ వై.ఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారని, ఇందుకోసం అన్ని విభాగాల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎ.వి.ధ‌ర్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. తిరుమలలోని గోకులం స‌మావేశ మందిరంలో శ‌నివారం ఉద‌యం టిటిడి అధికారులతో అద‌న‌పు ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని భద్రతా అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆలయం, రిసెప్షన్‌, సెక్యూరిటీ, పోలీస్‌, ఇతర అధికారులు సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa