ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలాజీ మెరైన్స్‌కు బోటు వెలికితీసే పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 29, 2019, 06:24 AM

బోటు ప్రమాదంపై హైలెవల్ టెక్నికల్ కమిటీ సమావేశం జరిగిందని చెప్పిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి.. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్‌కు బోటు వెలికితీసే పనులు అప్పగించామని తెలిపారు. బాలాజీ మెరైన్స్‌కు ఈ రంగంలో 35 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. బోటును వెలికితీయడానికి ఇప్పటికే రూ.22.70 లక్షలు ఖర్చు చేశామని కలెక్టర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా బోటు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య, వివరాలను వెల్లడించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి.. 26 మందిని సురక్షితంగా రక్షించగా, నదిలోంచి 36 మృతదేహాలను వెలికితీసినట్టు  తెలిపారు. మరో 16 మృతదేహాలు లభ్యం కావాల్సి ఉండగా... అందులో ఏపీకి చెందిన 8 మంది, తెలంగాణకు చెందిన 8 మంది ఉన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa