ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టికల్ 370 రద్దుపై వచ్చేనెల 13కు విచారణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 07:04 PM

కశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంలో చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నవంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది. జమ్మూ కశ్మీర్ కు స్వయంప్రత్తి హోద కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ జరిపింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్లపై వివరణ ఇచ్చేందుకు కేంద్రానికి నాలుగు వారాల గడువునిచ్చింది. రెండు వారాల కంటే ఎక్కవ సమయం ఇవ్వొద్ద‌న్న‌ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇదిలా ఉంటే జమ్ముకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 31న జమ్మూకశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa