ఎపి సిఎం జగన్ కు సీబీఐ షాకిచ్చింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎంగా బిజీగా ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ను సీబీఐ కోర్టు విచారణకు కూడా స్వీకరించింది. అయితే జగన్ దాఖలు చేసిన పిటిషన్పై సీబీఐ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపునిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ కౌంటర్ పిటిషన్లో పేర్కొంది. వాస్తవాలను దాచి పెట్టి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని కోర్టుకు విన్నవించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడే సాక్ష్యులను ప్రభావితం చేశారని సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేసింది.హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు హాజరుకావడానికి భద్రతా పరమైన ఏర్పాట్లు, ఏపీ లో రెవెన్యూ లోటనేది వ్యక్తిగత హాజరు మినహాయింపునించేందుకు కారణం కాదని పిటిషన్లో సీబీఐ పేర్కొంది. విజయవాడ నుంచి వారానికోసారి రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం పరిచింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్పై శుక్రవారం కోర్టు వాదనలు విననుంది.అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం జగన్ తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఇటీవల సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీకి సీఎంగా పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని, అలాగే ప్రతి వారం హైదరాబాద్ వచ్చి కోర్టులో హాజరయ్యేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వస్తున్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. జగన్ పిటిషన్పై సీబీఐ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa