ఆంధ్ర ప్రదేశ్ ఇసుక కొరతపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వం తీరును తూర్పారబడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతోందని, కొత్త ఇసుక విధానాన్ని అమలు చేయకుండానే, ఉన్న విధానాన్ని రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్య రోజురోజుకీ క్లిష్టం చేశారని, ముప్పై లక్షలకు పైగా కార్మిక కుటుంబాలతో ఆడుకునే హక్కు ఎవరికి ఇచ్చారని ప్రశ్నిస్తూ చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. అనాలోచిత నిర్ణయాలు, అవినీతి పోకడలతో రోజు కూలీలకు, నిర్మాణ రంగ కార్మికులకు దసరా పండగ లేకుండా చేశారని, ఆఖరికి, దీపావళి రోజున కూడా కార్మికుల బ్రతుకులు చీకటి పాలు చేశారని వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతోంది. కొత్త ఇసుక విధానం తేకుండానే ఉన్నదాన్ని రద్దు చేసారు. కొత్త విధానం తెచ్చి రెండు నెలలు కావస్తోంది. ఇసుక కొరత సమస్య రోజురోజుకు క్లిష్టం చేసారు. 30 లక్షల పైగా కార్మిక కుటుంబాలతో ఆడుకునే హక్కు ఎవరిచ్చారు.#NoSandNoWorkInAP
— N Chandrababu Naidu (@ncbn) October 25, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa