ఎపిలోని భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన నవంబర్ 3వ తేదిన విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించనుంది.. ఇసుక లభ్యత కాకపోవడంతో ఉపాధి కోల్పోయిన కార్మికులకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది.. ఛలో విశాఖపట్నం కార్యక్రమ నిర్వహణ కోసం హైదరాబాద్ లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదేండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.. కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న దుస్థితిని జిల్లా కేంద్రాల్లో ఎలుగెత్తి చాటాలని సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో ఇసుక సంక్షోభం నెలకొందని, తత్ఫలితంగా లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండేందుకు, ప్రభుత్వాన్ని కదిలిచేందుకు నవంబరు 3న జనసేన విశాఖలో నిర్వహించే లాంగ్ మార్చ్ కి జనసేనాని పవన్ కల్యాణ్ నాయకత్వం వహిస్తారు… దీనికి సంబంధించిన కార్యాచరణను జనసేన పార్టీ విడుదల చేసింది. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలను ప్రతి జిల్లా కేంద్రంలో ఎలుగెత్తాలని పేర్కొంది. ఈ నెల 30న కార్మికుల చేతులమీదుగా లాంగ్ మార్చ్ కు సంబంధించిన పోస్టర్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఆవిష్కరించాలని పిలుపు ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa