ఆంధ్రప్రదేశ్ లో బిజెపిని బలోపేతం చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రధానంగా టీడీపీ నుంచి కమలం పార్టీలోకి వలసలు షురూ ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితమే రాయలసీమ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వలసలతో పాటూ జగన్ సర్కార్ను టార్గెట్ చేస్తోంది బీజేపీ. అంశాల వారీగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది.తాజాగా జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. స్కూల్, పంచాయతీ భవనాలు.. వాటర్ ట్యాంకులకు వైఎస్సార్సీపీ జెండా రంగులు వేయడం, ఇసుక కొరతపై ట్వీట్ చేశారు. ‘రంగులేసుకోవడానికి,ఆర్భాటం చేయడానికి తప్ప రాష్ట్రాన్ని రూలింగ్ చేయడానికి పనికిరాని పార్టీ వైసీపీ. 150 సీట్లు ఇచ్చినందుకు రిటర్న్ గిఫ్ట్ గా ఇసుక కృతిమకొరత సృష్టించి రూ.150 కూలీ కూడా రాని పరిస్థితికి భవననిర్మాణ కార్మికులను తీసుకువచ్చిన ఇంత అసమర్ధ ప్రభుత్వాన్ని నేను ఇంతవరకూ చూడలేదు’అంటూ మండిపడ్డారు.కన్నా గతంలో కూడా వైఎస్సార్సీపీ సర్కార్పై విమర్శలు చేశారు. పోలవరం, రాజధాని అంశంతో పాటూ ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై స్పందిస్తున్నారు. తాజాగా స్కూల్, పంచాయతీ భవనాలు.. వాటర్ ట్యాంకులకు వైఎస్సార్సీపీ జెండా రంగులు వేయడంపై మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa