కర్నూల్ జిల్లా గూడూరు తహసీల్దార్ కుమారి షేక్ హసీన బీ అడిగిన లంచం ఎంతో తెలుసా ..? అక్షరాలా 8 లక్షలు.. చివరకు 4 లక్షలకు బేరం కుదిరింది. ఎందుకోతెలుసా..? అన్నదమ్ముల తగాదాకు సంబందించిన భూమి వివాదంలో కోర్టు తీర్పును అమలు చేసేందుకే ఆమె ఇంట లంచం డిమాండ్ చేసింది. చట్టప్రకారం తానూ ఖచ్చితంగా చెయ్యాల్సిన పనికే ఆమె ఇంట లంచం అడిగిందీ అంటే ఆ తహసిల్దార్ ఎంత బరితెగించిన అవినీతిపరురాలో వేరే చెప్పాలా ...? రైతు మహమ్మద్ షరీఫ్ వద్దనుండి 4ఎకరాలు రైతు సురేష్ కు విక్రయించాడు.. అయితే అన్నదమ్ముల తగాదా కోర్టు దాకా వెళ్ళింది.కోర్టులో అన్నదమ్ముల సమస్యను రైతులు పరిష్కరించుకున్నారు.. కోర్టు ద్వారా క్లియరెన్స్ ఆర్డర్ కాపీ తీసుకువచ్చి తహశీల్దార్ కి ఇచ్చారు.. కోర్టు ఆర్డర్ ప్రకారం పొలం రెవిస్యూ అడగంల్ లో రెడ్ మార్క్ తొలగించడానికి తహశీల్దార్ హసీనా..8లక్షల లంచం డిమాండ్ చేసింది. బేెరం 4లక్షలకు కుదుర్చుకుంది గూడూరు కు చెందిన రైతు సురేష్ దిక్కుతోచని పరిస్థితులలో అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. ధీంతో ఎసిబి డి.ఎస్.పి నాగభూషణం తహశీల్దార్ తరుపున బినామీ వ్యక్తి ఉషేన్ భాష పాణ్యం బస్ స్టాప్ దగ్గర రైతు వద్దనుండి 4లక్షల నగదు తీసుకుంటుడాగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.. తహశీల్దార్, బినామీ వ్యక్తి హుస్సేన్ భాష లపై కేసునమోదు చేశారు. 5 నిమిషాలలో న్యాయంగా చేసే పనికి 5 నెలలు ఆఫీస్ చుట్టూ తిప్పుకొనడంతో విసుగు చెంది దిక్కుతోచని పరిస్థితులులో రైతు సురేష్ ఎసిబిని ఆశ్రయించాడు..ప్రస్తుతం. తహశీల్దార్ కుమారి షేక్ హసీన పరారీలో ఉన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa