ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భూమి తీసుకోవాలో వద్దో తరువాత ప్రకటిస్తాం : సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 10, 2019, 06:53 PM

అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమి తీసుకోవాలా ? వద్దా ? అనే దానిపై తమ నిర్ణయాన్ని తరువాత ప్రకటిస్తామని సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అయోధ్యపై తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమి కేటాయించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై వక్ఫ్ బోర్డు చైర్మన్ జుఫర్ ఫారూఖీ మాట్లాడుతూ భూమి తీసుకోవాలో లేదో తరువాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయమై నవంబరు 26 న సమావేశం నిర్వహించి నిర్ణయం ప్రకటిస్తామన్నారు. భూమి తీసుకునే విషయంలో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. మసీదు నిర్మాణానికి భూమి తీసుకోవద్దని కొందరు ప్రతిపాదిస్తున్నారని చెప్పారు. మరి కొందరేమో ఆ భూమి తీసుకొని మసీదు నిర్మించడంతోపాటు విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు ఫరూఖీ తెలిపారు. అందుకే సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అయోధ్యపై తీర్పును స్వాగతిస్తున్నామని, దీనిపై రివ్యూ పిటిషన్ వేయబోమని మరోసారి స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa