ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆబిద్‌ అలీ ఖాతాలో మరో రికార్డు!!

international |  Suryaa Desk  | Published : Sun, Dec 22, 2019, 02:07 PM

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్తాన్‌ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. పాక్ ఓపెనర్లు షాన్‌ మసూద్‌ (198 బంతుల్లో 135; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), అబిద్‌ అలీ (281 బంతుల్లో 174; 21 ఫోర్లు, సిక్స్‌) సెంచరీలతో అదరగొట్టారు. మూడోరోజు ఆట ముగిసే సరికి పాక్‌ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 395 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగుల ఆధిక్యాన్ని సమర్పించుకున్న పాక్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఆ లోటును పూడ్చుకొంది. ఓవర్‌నైట్‌ స్కోరు 57/0తో పాకిస్తాన్‌ శనివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించగా.. మసూద్‌, అబిద్‌ మొదటి వికెట్‌కు 278 పరుగులు జోడించి పటిష్ఠ స్థితిలో నిలిపారు. నాలుగో రోజు ఆటగాలో అజహర్‌ అలీ సెంచరీ (103 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) చేసాడు. మరోవైపు బాబర్‌ ఆజమ్‌ (56 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీ చేసాడు. ప్రస్తుతం పాక్ 398 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ 191 పరుగులు చేయగా.. లంక 271 పరుగులు చేసింది. 32 ఏళ్ల లేటు వయసులో టెస్టుల్లో అడుగుపెట్టిన అబిద్‌ అలీ తాజా సెంచరీతో మరో రికార్డు సృష్టించాడు. ఆడిన తొలి వన్డే, టెస్ట్‌లో సెంచరీలు సాధించిన క్రికెటర్‌గా ఇప్పటికే రికార్డు నెలకొల్పిన అలీ.. ఆడిన మొదటి రెండు టెస్ట్‌ల్లో సెంచరీలు చేసిన తొలి పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన తొమ్మిదో క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంకతో రావల్పిండిలో డ్రా అయిన మొదటి టెస్ట్‌లో అరంగేట్రం చేసిన అబిద్‌ సెంచరీ (109) చేసిన సంగతి తెలిసిందే. గత మార్చిలో దుబాయ్‌లో ఆస్ట్రేలియాపై తన తొలి వన్డేలోనే సెంచరీ (112) చేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa