రాష్ట్ర అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని వైసీపీ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. రైతులకు కేటాయించిన ప్లాట్లను అభివృద్ధి చేశాకే వారికి కేటాయిస్తామన్నారు. కేబినేట్ భేటీ తర్వాతే మూడు రాజధానుల అంశాన్ని వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాంతీయ అసమానతలు కలుగకూడదనే కమిటీ వేశామని.. అపోహలు నమ్మవద్దని బొత్స సూచించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రజలు తమను గెలిపించారని మంత్రి గుర్తుచేశారు. అందులో భాగంగానే అభివృద్ధి వికేంద్రీకరణను చేస్తామని తెలిపారు. అమరావతి పేరుతో గత ప్రభుత్వం దోపీడీలు చేసిందని ఆరోపణలు సంధించారు. 13 జిల్లాలకు సమాన న్యాయం జరిగేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa