అధికార కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వ్యవహరించాల్సి ఉందని మాజీ మంత్రి చిదంబరం చెప్పారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బిజెపి ఎదురులేని పార్టీ ఏమి కాదని వెల్లడైందన్నారు. ఈ పార్టీని కూడా ప్రతిపక్షాలు సంఘటితంగా చిత్తు చేయవచ్చునని చిదంబరం చెప్పారు. సిఎఎకు వ్యతిరేకంగా సోమవారం చెన్నైలో జరిగిన ప్రదర్శనలో మాజీ మంత్రి మాట్లాడారు. జార్ఖండ్ ఫలితాలపై కాంగ్రెస్ సంతోషంగా ఉందన్నారు. జెఎంఎ కాంగ్రెస్ కూటమికి అనుకూల తీర్పు వెలువరించినందుకు జార్ఖండ్ ఓటర్లకు తాము అభినందనలు తెలియచేస్తున్నామని చిదంబరం చెప్పారు. బిజెపి దుర్భేధ్యం అనే వాదనకు కాలం చెల్లిందని, దేశానికి ఎదురవుతున్న సవాళ్ల కోణంలో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తే బిజెపిని దెబ్బతీయడం సాధ్యమేనని చిదంబరం తెలిపారు. గత మూడు నెలలుగా ఎన్నికలలో బిజెపికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయని , హర్యానాలో భంగపాటు, మహారాష్ట్రలో తిరస్కరణ, ఇప్పుడు జార్ఖండ్లో ఓటమి మూటకట్టుకుందని విశ్లేషించారు. ఈ ఏడాది బిజెపి పతనావస్థ ఇదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa