ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 11:08 AM

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బొల్సొనారో   హాజరయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌  జాతీయ యుద్ధ స్మారక కేంద్రాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa