ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసోంలో పేలుళ్ల కలకలం..!

national |  Suryaa Desk  | Published : Sun, Jan 26, 2020, 11:05 AM

గువాహటి: యావత్తు దేశం 71వ గణంత్ర వేడుకలకు జరుపుకొంటుండగా.. అసోంలో జరిగిన గ్రనేడ్‌ పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఆదివారం ఉదయం అసోంలోని దిబ్రూగఢ్‌, చరైదేవ్‌, దులియాజాన్‌ ప్రాంతాల్లో స్వల్ప స్థాయి పేలుళ్లు సంభవించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇది నిషేధిత తీవ్రవాద సంస్థ ‘యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అసోం-ఇండిపెండెంట్‌’(యూఎల్‌ఎఫ్‌ఏ-ఐ)  పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకల్ని బహిష్కరించాలని ఈ సంస్థ శనివారం పిలుపునిచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ఈశాన్య భారత్‌లోని పలు తీవ్రవాద సంస్థలు గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల బహిష్కరణకు పిలుపునిస్తూ వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa