ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి దర్శనానికి గ్రీన్ సిగ్నల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 05, 2020, 03:44 PM

తిరుమల భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. ఈ నెల 11 నుంచి తిరుమలలో దర్శనానికి అనుమతిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జూన్ 8,9 తేదీలలో టీటీడీ ఉద్యోగులతో ట్రయల్ రన్ వేయనున్నారు. 10వ తేది స్థానికులకు దర్శనానికి అనుమతివ్వనున్నారు. 10 ఏళ్లలోపు పిల్లలు,60 ఏళ్లు పైబడిన వృద్దులకు తిరుమలకు అనుమతి లేదు. కంటైన్మెంట్,రెడ్ జోన్ పరిధిలో ఉన్న భక్తులకు అనుమతి లేదు. ఉదయం 6.30 నుంచి రాత్రి 7.30 వరకు భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రతి రోజు 7 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతివ్వనున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత తీర్ధం,శఠగోపం ఉండదు. కళ్యాణకట్ట,హుండీ,అన్న ప్రాాసాదం వద్ద ప్రత్యేక కౌంటర్లు. శ్రీవారి దర్శనానికి మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి. ఘాట్ రోడ్డులో వాహనాలకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతి. అలిపిరి వద్ద భక్తులకు స్క్రీనింగ్ పరీక్షలు. క్యూలైన్లలో కూడా పరీక్షలు మరియు శానిటైజేషన్. శ్రీవారి మెట్ల మార్గం ద్వారా అనుమతి లేదు. కాలినడక భక్తులకు అలిపిరి మార్గం నుంచే అనుమతి. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి. జూన్ 11వ తేది నుంచి ఉదయం 6.30 నుంచి 7.30 వరకు వీఐపీ దర్శనాలకు అనుమతి. రోజుకు గంట మాత్రమే వీఐపీ దర్శనాలకు అనుమతి. రూంల కేటాయింపు ఒక్కరోజుకు మాత్రమే. రెండు రోజులు రూంల కేటాయింపులు ఉండవు. పుష్కరిణిలో స్నానం నిషేధం. గంటకు 500 మందికి మాత్రమే అనుమతి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa