ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో ‘దిశ’ తరహా ఘోరం

national |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 03:05 PM

నిర్భయ, దిశ ఘటనలు మరవకముందే దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. జార్ఖండ్ కు చెందిన ఓ 16 ఏళ్ల యువతి ఢిల్లీలోని ఓ ఇంట్లో పని చేస్తోంది. ఆమె తన సొంత రాష్ట్రం జార్ఖండ్ వెళ్లేందుకు ఆనంద్ విహార్ రైల్వేస్టేషనుకు వచ్చింది. అమాయకరంగా కనిపించిన ఆ అమ్మాయిని గమనించిన ముగ్గురు యువకులు ట్రైన్ ఎక్కిస్తామని చెప్పి నమ్మించారు. వారితో తీసుకెళ్లి బలవంతంగా మద్యం తాగించారు. అనంతరం బాలికపై ఆ ముగ్గురు రాక్షసులు సామూహికంగా అత్యాచారం చేశారు. అనంతరం బాలికను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో తూలతూ వస్తున్న ఆ బాధితురాలని ఓ పోలీసు కానిస్టేబుల్ గమనించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు. మహిళా పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించగా తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పింది. దీంతో బాలికకు వైద్యపరీక్షలు చేయించి ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa