ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 మంది భారత జవాన్ల మృతి

national |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 02:24 PM

భారత్,చైనా జవాన్ల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారని ఏఎన్ఐ కథనం ద్వారా తెలుస్తోంది. లడాఖ్ గాల్వాన్ లోయలో సోమవారం రాత్రి భారత్,చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించారని,మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్టు సమాచారం. చైనా జవాన్లు కూడా 43 మంది వరకు గాయపడ్డారని ఏఎన్ఐ కథనం ఆధారంగా తెలుస్తోంది. చైనా జవాన్లు మరణించిన సంఖ్య పై క్లారిటి లేదు.ముందుగా ఒక కల్నల్,ఇద్దరు జవాన్లు మరణించారని భారత ప్రభుత్వం తెలిపింది. కానీ భారీగా మృతులున్నారని ఆలస్యంగా తెలిసింది. కాల్పులు జరగలేదని ఆర్మీ తెలిపినా ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగడంతో తీవ్ర స్థాయిలోనే వాగ్వాదం జరిగినట్టు సమాచారం.ప్రస్తుతం లడాఖ్ పరిసర ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పటి వరకు 10 మంది భారత జవాన్ల మృతదేహాలు దొరికాయి. ప్రస్తుతం భారత్,చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా సరిహద్దులో ఉద్రిక్తతలపై ఇప్పటికే CDS చీఫ్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు, విదేశాంగ మంత్రితో రక్షణమంత్రి సమావేశమై చర్చించారు. అటు ప్రధాని మోదీకి సైతం వివరించారు. కాసేపటి క్రితం ప్రధాని మోదీతో హోంమంత్రి అమిత్ షా కూడా చర్చలు జరిపారు. 1975 తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఘర్షణలో ప్రాణ నష్టం జరగడం ఇదే మొదటి సారి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa