ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమర్ నాథ్ యాత్రికులపై ఉగ్రదాడి ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 11, 2017, 03:47 PM

అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, లష్కర్ అయినా, ఐసిస్ అయినా సరే, ఏ ఉగ్రవాద సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కానివ్వమని, దేశమంతా ఐక్యంగా ఉందని అన్నారు. ఉగ్రవాదుల దాడిని హేయమైన చర్యగా పేర్కొన్న అసదుద్దీన్, దాడి విషయమై ఎవరూ రాజకీయాలు చేయొద్దని సూచించారు. దాడి సంఘటనకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అసదుద్దీన్ పేర్కొన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ప్రయాణిస్తున్న అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు నిన్నజరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa