జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ ఉగ్రదాడిలో మరణించిన అమరనాథ్ యాత్రికుల మృతదేహాలను గుజరాత్ చేర్చారు. శ్రీనగర్ నుంచి ఏడుగురు యాత్రికుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో సూరత్ కు తీసుకొచ్చారు. మృతులకు గుజరాత్ సీఎం విజయ్ రూపానీ నివాళులు అర్పించారు. ఈ దాడిలో గాయపడ్డవారిని కూడా ఇదే విమానంలో గుజరాత్ తీసుకువచ్చారు. సూరత్ విమానాశ్రయంలో సీఎం విజయ్ రూపానీ క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం తరుపున బాధితులను ఆదుకుంటామని, మృతుల కుటుంబాలకు 10 లక్షలు, గాయపడ్డవారికి రెండు లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa