ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది: బొత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 12, 2017, 03:44 PM

కర్నూలు : నంద్యాలలో టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలను వేధిస్తున్నారని ఆ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాగా నంద్యాలలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికల వేళ వైఎస్‌ఆర్‌ సీపీ శ్రేణులను భయపెట్టే ఎత్తుగడతో టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరిన కౌన్సిలర్‌ సుబ్బారాయుడు ఇంట్లో అర్థరాత్రి సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గౌరు చరిత, ఐజయ‍్య బుధవారం కౌన్సిలర్‌ సుబ్బారాయుడుని కలిశారు.అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ అధికార పార్టీ నేతల అక్రమాలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు. రోజుకో హామీతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపు తథ్యమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa